
మనకి తెలిసినంత వరకు ఎక్కడ కూడా నాన్ వెజ్ ను ప్రసాదంగా పెట్టరు. కానీ, మన దేశంలో కొన్ని దేవాలయాల్లో మాంసాహారాలనే నైవేద్యంగా పెడతారు. మరి, ఈ వింత ఆలయాలు ఎక్కడ ఉన్నాయో యెక్కడ చూద్దాం..

ముత్తప్పన్ దేవుడు : కేరళలో ముత్తప్పన్ దేవుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే భక్తులు చేపలు, కల్లును నైవేద్యంగా పెడతారు. ఈ ఆచారం పాత కాలం నుంచి వస్తుంది.

టాంటానియా కాళీబరి : కోల్కతాలో ఈ కాళీ ఆలయం చాలా ఫేమస్. అక్కడి భక్తులు అమ్మవారికి మేకలను బలి ఇచ్చి, బిర్యానీ చేసి నైవేద్యంగా పెడతారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది.

తారాపీఠ్ ఆలయం : ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ లో చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు. ఇక్కడ ప్రజలు పాటించే సంప్రదాయాలు చూస్తే మనకి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే, అక్కడ ఉండే తారా దేవికి మేక మాంసం, చేపలను వండి ఆమెకు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదం కోసం జనాలు ఎగబడి మరి అక్కడికి వెళ్తారు.

మునియాండి స్వామి దేవాలయం : తమిళనాడులో మారుమూలన ఉన్న వడక్కంపట్టి అనే చిన్న ఊరులో మునియాండి స్వామి వారి గుడి చాలా ఫేమస్. అయితే, ఇక్కడ ప్రతి ఏటా ఓ ఉత్సవాన్ని పెద్ద పండుగలా జరుపుతారు. ఆ సమయంలో వేల కోళ్ళను, మేకల బలి ఇచ్చి స్వామి వారికి నైవేద్యంగా పెడతారు.