
భారతీయ హిమాలయాల్లోని కిన్నెర్ కైలాష్ పరిక్రమ అనేది సవాలుతో కూడిన ట్రెక్కింగ్ ప్లేస్. కిన్నౌర్ జిల్లాలోని సుందరమైన కిన్నౌర్ లోయలో భారతదేశం, టిబెట్ మధ్య సరిహద్దుకు సమీపంలో ఉన్న పవిత్ర పర్వతం కిన్నర్ కైలాష్ ఉంది. టిబెట్కు సమీపంలో ఉండడం వలన ఇక్కడ బౌద్ధ, హిందూ సంస్కృతుల కలయికను చూడవచ్చు. అయితే ఇక్కడ వెళ్లడానికి విదేశీ పౌరులకు ముందస్తు అనుమతులు అవసరం

కొంచెం సాహస చర్యలు అంటే ఇష్టం ఉన్నవారు చంద్రశిల వరకు ట్రెక్కింగ్ కు వెళ్లొచ్చు. దేశంలోని ఎత్తైన శివాలయం తుంగనాథ్ ఇక్కడ ఎత్తైన శిఖరంపై ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ అనుభవం చాలా ఉత్సాహంగా ఉంటుంది.

ఎవరైనా మొదటిసారిగా పర్వతారోహణ క్లబ్లో చేరబోతున్నట్లయితే కేదార్కంఠ ఉత్తమమైన ట్రెక్కింగ్ ప్లేస్. ఇది ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల శిఖరం. దీని ఎత్తు దాదాపు 12,500 అడుగులు.

శ్రీఖండ్ మహాదేవ్ శిఖర్ ట్రెక్కింగ్ కూడా చాలా ఉత్తేజకరమైనది. ఇక్కడ నుంచి శివుని నివాసమైన కైలాశ పర్వం మీద ఉన్న సుందరమైన దృశ్యాన్ని చూడవచ్చు. అయితే ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది.

ఉత్తరాఖండ్ లోని బాలి పాస్ ట్రెక్కింగ్ పర్వతారోహకుల కల నిజం చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల ఉత్కంఠభరితమైన వీక్షణతో పాటు ఆసియాలోని అతి పొడవైన, ఎత్తైన రోప్వేపై థ్రిల్లింగ్ రైడ్ను అందిస్తుంది. సముద్ర మట్టానికి 4,800 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం మంచుతో నిండిన రోడ్లు, హిమానీనదాలు, పచ్చికభూములు, నిటారుగా ఉన్న వాలులతో సహా అనేక రకాల ప్రకృతి దృశ్యాలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.