
మనలో చాలా మంది అరటి పండును పరగడుపున తింటారు. అయితే, అసలు ఇలా తినొచ్చా? లేదో అని కూడా తెలుసుకోకుండా తినేస్తారు. మరి, దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

పరగడుపున అరటి పండును తీసుకుంటే.. అది సరిపోను శక్తినివ్వదని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఇది ఆ సమయంలో ఐరన్ ను గ్రహించ లేదు. దీని వలన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది.

ఇక బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. బనానాలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. దీనిని తీసుకున్న గంటకే ఆకలి వేస్తుంది. ఇక ఏదోకటి తినేస్తారు. ఆ తర్వాత బరువు కూడా అమాంతం పెరుగుతారు.

అరటి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా ఇది కడుపు నొప్పిని కూడా తీవ్రతరం చేస్తుంది. కాబట్టి, అరటి పండును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

పరగడుపున తీసుకుంటే అరటి పండ్లను తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. దీని వలన మగ వారికీ, ఆడ వాళ్ళకి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)