
ఆగస్టు నెల ముగియనుంది. రేపటి నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. నెలలు మారుతున్న కొద్దీ గుర్తుంచుకోవలసిన అనేక ఆర్థిక విషయాలు ఉన్నాయి. ఈ ముఖ్యమైన ఆర్థిక విషయాల గురించి మర్చిపోవద్దు. మరిచిపోతే మీకే నష్టం. ఇందులో ముఖ్యమైనది రూ.2000 నోటు మార్పు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను మార్చుకునేందుకు గడువు ఇస్తుందనే గ్యారంటీ లేదు. బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోటును వెంటనే మార్చుకోండి.

అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ నెలలో చాలా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందుకు సెలవుల జాబితాను గుర్తించుకుని అప్రమత్తం కావడం చాలా ముఖ్యం. మీరు నోటు మార్పిడికి వెళ్లినప్పుడు బ్యాంకు మూసివేయబడితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. దీని తరువాత ప్రజలు తమ వద్దనున్న 2000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 నాటికి మార్చుకోవడానికి అనుమతించింది. అంటే ఇప్పటి నుండి 30 రోజుల్లోపు మార్చుకోవాల్సి ఉంటుందన్నట్లు.

2000 రూపాయల నోట్ల మార్పిడికి గడువు ముగియనుంది. ఈరోజు ఆగస్ట్ 31. మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోటు మార్చుకోకపోతే వెంటనే ఈ పని చేయడం చాలా ముఖ్యం. బ్యాంకులకు హాలిడేస్ ఎక్కువగా ఉన్నందున ఈ పని పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుండా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ప్రజల సౌకర్యార్థం 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకును ఎక్కడ, ఎలా, ఎప్పుడు మార్చాలనే ఆందోళన లేకుండా బ్యాంకును మార్చుకోవాలని సూచించారు. ఇందుకోసం నాలుగు నెలల సమయం కూడా ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకుకు వెళ్లి నోట్లను సులభంగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ.