
దాదాపు 16 సంవత్సరాల తర్వాత గురు గ్రహం బలంతో కుబేరయోగం ఏర్పడబోతుందంట.జాతకంలో గురు బలం ఉంటే వారు మంచి స్థానంలో ఉంటారంటారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యంపరంగా, ఆర్థికంగా చాలా బాగుంటారు. అంతే కాకుండా వారి జీవితం రాజయోగంలా ఉంటుంది. ఏ పని చేసినా విజయం అందుకుంటూ చాలా ఆనందంగా గడుపుతుంటారు. అయితే ఈ గురు గ్రహం ఫలితంగా మూడు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. అవి

మేష రాశి : ఈ రాశి వారికి గురు గ్రహం ప్రభావం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా సొంతింటి కలు నెరవేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు మంచి ర్యాంకులు పొంది సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఏ పని చేసినా వ విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది.

మకర రాశి : మకర రాశి వారికి గురు ప్రభావంతో ఏర్పడే కుభేర యోగంతో అదృష్టం కలిసి రానుంది. వీరికి ఇంటి నిండా డబ్బే. జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.

అంతే కాకుండా ఈ సమయంలో ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సొంతింటి కల నెరవేర్చుకుంటారు.