
పెరుగు, అరటిపండు బరువు తగ్గించడంలో చాలా సమర్థంగా పనిచేస్తాయి. ఈ రెండు పదార్థాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన చాలావరకు ఉంటుంది. అలాగే ఈ రెండూ శరీరానికి చలువను అందిస్తాయి.

ব্పాలు, అరటిపండు వల్ల కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది.

అరటిపండు, పాలు కలిపి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బరువు కూడా పెరుగుతారు. సైనస్ సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అదేవిధంగా వివిధ రకాల అలెర్జీలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు పాలు-అరటిపండుకు బదులుగా పెరుగు- అరటిపండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేస్తుంది. అదేవిధంగా ఇందులో శరీరానికి మేలు చేసే కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. పెరుగును తరచుగా తీసుకోవడం వల్ల పలు రోగాలు నయమవుతాయి. ఇక అరటిపండులోని ఫైబర్తో శరీరంలో క్యాల్షియం శోషణ పెరుగుతుంది.

అరటిపండులో ఉండే పొటాషియం కండరాలకు విశ్రాంతినిస్తుంది. పెరుగులో ఉండే సోడియం, మరోవైపు కండరాల సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. ఈ రెండు మిశ్రమాలు కణాలలో పోషకాల రవాణాలో సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ట్రిప్టోఫాన్ న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్గా మార్చబడుతుంది. ఇది నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

మలబద్ధకం, అజీర్తి తదితర ఉదర సంబంధిత సమస్యలు తగ్గించుకోవాలంటే రోజువారీ ఆహారంలో పెరుగు, అరటిపండును తీసుకోవాలంటున్నారు నిపుణులు.
