
వేగంగా బరువు పెరగడం: బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట మనం శారీరక శ్రమ చేయం కాబట్టి ఆ కేలరీలు కరగవు. ఫలితంగా అవి కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి. నిద్రపోతున్నప్పుడు మెటబాలిజం నెమ్మదించడం వల్ల బరువు పెరగడం ఖాయం.

చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు: తెల్ల బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే ఇది రక్తంలో షుగర్ లెవల్స్ను ఒక్కసారిగా పెంచుతుంది. ఇది డయాబెటిస్ బాధితులకు మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

జీర్ణ సమస్యలు: చాలా మంది రాత్రి అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. బియ్యం జీర్ణక్రియను నెమ్మదింపజేయడమే ఇందుకు కారణం.

ఇవి తింటే మంచిది: మల్టీగ్రెయిన్ రోటీ తింటే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. బియ్యంతో పోలిస్తే క్వినోవా - మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

దాలియా ఫైబర్ నిధి. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. పప్పులు, కూరగాయలతో చేసే కిచిడి తేలికైన, పోషకాలున్న ఆహారం.