పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఉమేష్ యాదవ్ ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తద్వారా రోహిత్, గేల్, యూసుఫ్ పఠాన్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఏదైనా ఒక ఐపీఎల్ జట్టుపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం గెల్చుకున్నారు.
1 / 6
ఈ ముగ్గురు ఆటగాళ్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఉమేష్ యాదవ్ మరో రికార్డు సృష్టించాడు. అదేంటంటే.. ఐపీఎల్లో10 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన ఏకైక పేసర్. పంజాబ్ కింగ్స్పై 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం ఉమేశ్కు పదోసారి.
2 / 6
IPL 2022 సీజన్లో కేకేఆర్ బౌలర్ ఉమేష్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నాడు. ఒక్కో మ్యాచ్తో ఒక సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అందులో భాగంగానే పంజాబ్ కింగ్స్పై 4 వికెట్లు తీసి రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి IPL స్టార్ల రికార్డును అధిగమించాడు.
3 / 6
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికవ్వడం ద్వారా ఐపీఎల్లో ఏదైనా ఒక ప్రత్యర్థి జట్టుతో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకు ఎంపికైన ఆటగాడిగా ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను రోహిత్ శర్మ, క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్లను అధిగమించాడు.
4 / 6
గతంలో రోహిత్ శర్మ KKRపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా.. క్రిస్ గేల్ KKRపై 5 సార్లు, యూసుఫ్ పఠాన్ డెక్కన్ ఛార్జర్స్పై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు.
5 / 6
పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఒక జట్టుపై అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆటగాడిగా ఉమేశ్ రికార్డు సృష్టించాడు.