
కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల బియ్యం, 5 పెద్ద టమాటాలు, మూడు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 బిర్యానీ ఆకులు , 4 లవంగాలు, 5 యాలకులు, దాల్చిన చెక్క, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి అర కట్ట కొత్తిమీర, పుదీనాను తీసుకోవాలి.

ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.

ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి.ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పొడి, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ బిర్యానీ మసాలా పొడి , గరం మసాలా పొడి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర కట్ట పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి నానబెట్టిన బియ్యంలో వేసాలి.

ఇక ఇప్పుడు మంచి నీళ్ళు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. విజిల్స్ వచ్చాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు ఉంచి కిందకు దించేయాలి.