రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల కోసం బారులు తీరిన జనాలు పొడవాటి క్యూలలో నిల్చుని అవస్తలు పడుతుంటారు. సమయానికి టికెట్ దొరకక ట్రైన్ వెళ్లిపోయే పరిస్థితులు కూడా చాలా మంది చవిచూసి ఉంటారు. ఇకపై ఈ బాధలకు ఉండడం రైల్వే శాఖ చెక్ పెట్టనుంది.
అందుకు అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ (యూటీఎస్) యాప్ తీసుకొచ్చింది.
దీని ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలో ఆ రోజుకు మాత్రమే జనరల్ రైలు టికెట్, ప్లాట్ఫారమ్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది.
స్మార్ట్ ఫోన్లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ జీపీఎస్ ఆధారంగా పని చేస్తుంది. దీని ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఇలా యాప్తో బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్కు 15 మీటర్ల దూరంలో ఉండాలి.