ఉప్పుతో ఇలా చేస్తే.. ఇక సబ్బులు కొనాల్సిన అవసరం లేదు?

Updated on: Feb 05, 2026 | 1:35 PM

కిచెన్ లో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే, మనం నిత్యం దీనిని వాడుతూనే ఉంటాము. ఏది చేయాలన్నా కూడా ఉప్పు తప్పనిసరి. అయితే, ఉప్పును కూరలకే కాకుండా.. మన ఇంట్లోని కొన్ని సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మన అందరి ఇళ్ళలో చీమలు ఉంటూనే ఉంటాయి. ఇవి ఒక్కోసారి విసుగు తెప్పిస్తాయి. అలాంటి సమయంలో ఉప్పును కానీ, ఉప్పు నీళ్ళను కానీ చల్లితే అవి అక్కడి నుంచి మాయం అవుతాయి.

మన అందరి ఇళ్ళలో చీమలు ఉంటూనే ఉంటాయి. ఇవి ఒక్కోసారి విసుగు తెప్పిస్తాయి. అలాంటి సమయంలో ఉప్పును కానీ, ఉప్పు నీళ్ళను కానీ చల్లితే అవి అక్కడి నుంచి మాయం అవుతాయి.

2 / 5
కాఫీ, టీ పోగొట్టడం కోసం సబ్బుల మీద సబ్బులు వాడి వాటిని పోగొట్టాలని చూస్తారు కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. గిన్నెలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మురికి ఉన్న చోట పోసి బాగా రుద్దండి మరకలు మొత్తం పోతాయి.

కాఫీ, టీ పోగొట్టడం కోసం సబ్బుల మీద సబ్బులు వాడి వాటిని పోగొట్టాలని చూస్తారు కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు. గిన్నెలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మురికి ఉన్న చోట పోసి బాగా రుద్దండి మరకలు మొత్తం పోతాయి.

3 / 5
మొండి మరకలు వదలాలంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ మరకలు ఉన్న చోట బాగా రుద్దితే ఎంతటి మరకలైన వెంటనే పోతాయి. అలా అని గట్టిగా రుద్దకండి సున్నితంగా రుద్దాలి.

మొండి మరకలు వదలాలంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ మరకలు ఉన్న చోట బాగా రుద్దితే ఎంతటి మరకలైన వెంటనే పోతాయి. అలా అని గట్టిగా రుద్దకండి సున్నితంగా రుద్దాలి.

4 / 5
మనం పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కోసారి గాలికి మంటలు చెలరేగుతాయి. అలాంటి సమయంలో నీరు కాకుండా ఉప్పు చల్లితే మంట ఆరిపోతుంది. కొందరు భయంతో వెంటనే నీళ్ళు పోస్తారు అలా చేయకండి ఇప్పటి నుంచి ఉప్పును చల్లండి.

మనం పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కోసారి గాలికి మంటలు చెలరేగుతాయి. అలాంటి సమయంలో నీరు కాకుండా ఉప్పు చల్లితే మంట ఆరిపోతుంది. కొందరు భయంతో వెంటనే నీళ్ళు పోస్తారు అలా చేయకండి ఇప్పటి నుంచి ఉప్పును చల్లండి.

5 / 5
మనం వేసుకునే బట్టల్లో కొన్ని రంగు వెలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో మీరు ముందుగా మీరు వేసుకున్న బట్టలను 10 నుంచి 15 నిముషాల పాటు ఉప్పు నీటిలో నానాబెట్టండి. ఇలా చేయడం వలన రంగు పోకుండా ఉంటుంది. ఇక కొత్త బట్టలు కూడా సేఫ్.

మనం వేసుకునే బట్టల్లో కొన్ని రంగు వెలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో మీరు ముందుగా మీరు వేసుకున్న బట్టలను 10 నుంచి 15 నిముషాల పాటు ఉప్పు నీటిలో నానాబెట్టండి. ఇలా చేయడం వలన రంగు పోకుండా ఉంటుంది. ఇక కొత్త బట్టలు కూడా సేఫ్.