
పచ్చి కొబ్బరి, ఎండు మిర్చితో చేసిన చట్నీ తింటే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.ఈ పచ్చడిని ఎక్కువగా అన్నం, ఇడ్లీ, దోసల్లోకి తింటారు. అంతేకాదు, అన్నంలోకి కూడా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

పచ్చి కొబ్బరి ఎండు మిర్చి చట్నీ ఎలా తయారు చేయాలంటే? పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 7 ఎండు మిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు. రెండు టేబుల్ స్పూన్ల నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, దానిలో నాలుగు ఎండుమిర్చి, జీలకర్రను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిని పొడి లాగా పెట్టుకోవాలి.

మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు, వేయించిన ఎండుమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ వెల్లుల్లి, రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు రసం , రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

పాన్లో ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేయించి, ఆ పోపును చట్నీలో వేసి కలుపుకోవడమే.