పచ్చి రొయ్యలు, దోసకాయ కూర ఇలా వండితే.. ఆపకుండా లాగిస్తూనే ఉంటారు

Updated on: Mar 07, 2026 | 4:16 PM

పచ్చి రొయ్యలు, దోసకాయ కూర ఇలా వండితే టేస్ట్ అదిరిపోతోంది. ఈ రెండింటి కాంబోలో కూర చేస్తే మీ ఇంట్లో వాళ్లు ఆపకుండా లాగిస్తూనే ఉంటారు. దీనిని సరైన కొలతలతో వండితే తినని వాళ్ళు కూడా తింటారు. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు : పచ్చి రొయ్యలు, దోసకాయ, నాలుగ పండు టమాటోలు, 50 గ్రాముల పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, వంట నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : పచ్చి రొయ్యలు, దోసకాయ, నాలుగ పండు టమాటోలు, 50 గ్రాముల పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, వంట నూనెను తీసుకోవాలి.

2 / 5
ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని ఉప్పుతో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత  గ్యాస్ వెలిగించి  పాన్ పెట్టి అది వేడయ్యాక వాటిలో దోసకాయ ముక్కలు, ఒక టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు రసం వేసి స్టవ్ మీదే ఉంచాలి.

ముందుగా పచ్చి రొయ్యలను తీసుకుని ఉప్పుతో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి అది వేడయ్యాక వాటిలో దోసకాయ ముక్కలు, ఒక టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు రసం వేసి స్టవ్ మీదే ఉంచాలి.

3 / 5
 ఇక ఇప్పుడు దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత రొయ్యలు వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత దానిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.

 ఇక ఇప్పుడు దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత రొయ్యలు వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత దానిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.

4 / 5
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా దానిని కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు పోసి 
పోసి 10 నిమిషాల పాటు స్టవ్ ఉడికించాలి.

ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా దానిని కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు పోసి పోసి 10 నిమిషాల పాటు స్టవ్ ఉడికించాలి.

5 / 5
దించే ముందు కొత్తిమీర వేసి దించాలి. అంతే, వేడి వేడి పచ్చి రొయ్యలు దోసకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే స్పైసిగా టేస్ట్ అదిరిపోతుంది.

దించే ముందు కొత్తిమీర వేసి దించాలి. అంతే, వేడి వేడి పచ్చి రొయ్యలు దోసకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే స్పైసిగా టేస్ట్ అదిరిపోతుంది.

Follow Us