
తల్లిదండ్రులు పిల్లల గురించి కొంచం కూడా ఆలోచించకుండా డైపర్లు వేస్తూనే ఉంటారు. ఇలా వేయడం వాళ్లకి కూడా ఒక అలవాటు అయిపోయింది. పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళాలనుకుంటే చాలు డైపర్లు వెంటనే తొడిగేస్తారు.

ఓ అధ్యయనం చెప్పిన దాని ప్రకారం అనేక చోట్ల చిన్న పిల్లలకు చిన్న తనం నుంచే టాయిలెట్ కి ఎలా వెళ్ళాలో కూడా ముందే నేర్పిస్తారు. కానీ, కొన్ని దేశాల్లో ఇంకా డైపర్లు వాడుతున్నారు. ఇది ఇప్పటికీ బాగానే ఉన్నాముందు ముందు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

దీని వలన పిల్లలకు ఇన్ఫెక్షన్లు వస్తాయని తెలిపారు. అలాగే వీటిని వేయడం మానేస్తే తల్లి దండ్రులకు ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. 18 నుంచి 24 నెలలు మధ్య ఉన్న పిల్లలకు మూత్ర, మల విసర్జన గురించి ముందే చెప్పాలని సూచనలు ఇచ్చారు.

ఎందుకంటే, ఈ వయస్సు నుంచే వారు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. రాత్రి పడుకునే ముందు మీ పిల్లలకు ఒకసారి టాయిలెట్కు వెళ్లాలని రోజూ చెబుతూ ఉండండి. మళ్ళీ ఉదయం లేచిన మళ్ళీ అలాగే చేయమని చెప్పండి. ఇలా చేస్తే వాళ్లకి అలవాటు అవుతుంది.

పిల్లలకు నాలుగేళ్ల వరకు డైపర్లు వేస్తూనే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఈ అలవాటును మానుకోవాలి. అవసరమైతే తప్ప డైపర్లు వేయకండి. మీ పిల్లల వయస్సు 2 ఏళ్ళు దాటాక డైపర్లు వేయడం పూర్తిగా మానేయండి. దీని వల్ల మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.