
ప్రస్తుతం సమాజంలో ఆడవారిలో ఎంతో మంది మంగళసూత్రాన్ని బంగారమే ధరిస్తారు. ఇతర లోహాలతో చేసినవి వాళ్లు ఎప్పుడు కూడా పెటుకున్నది లేదు. మరి, దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..

హిందూ సంప్రదాయంలో ఈ ఆచారం తప్పక పాటిస్తారు. అయితే, ఇటీవలే బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది మంగళసూత్రాలు కొనడానికి కూడా భయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ కాకుండా వెండి, రాగి వంటి వాటితో చేయించుకుంటే ఏం జరుగుతుందని అనే ఆలోచిస్తుంటారు. దీని గురించి పండితులు నమ్మలేని నిజాలు చెప్పారు.

అయితే, శాస్త్రాలలో కూడా మంగళ సూత్రాన్ని బంగారం మాత్రమే ధరించాలని ఎక్కడా రాసి లేదు. అలా అని ఇతర లోహాలతో చేయించుకోవాలని కాదు.

మీకు బంగారం కొనడానికి కష్టం అయితే దానికి బదులుగా మెడలో పసుపు కొమ్మును వేసుకోవచ్చని ఆయన వివరించారు. కాబట్టి, మీరు కూడా గోల్డ్ కాకుండా పండితులు చెప్పింది చేస్తే కొంత వరకు డబ్బు ఆదా అవుతుంది. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.