డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. ఎండుద్రాక్షలో హిమోగ్లోబిన్ను పెంచే ఐరన్ ఉంటుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది. ఈ నీటితో జీర్ణశక్తి పెరుగుతుంది.
రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే.. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని కూడా తొలగిస్తుంది. ఈ నీటితో జీర్ణశక్తి పెరుగుతుంది.
మీకు బలహీనమైన ఎముకలు లేదా కండరాల నొప్పులు ఉన్నట్లయితే, మీరు రోజూ నానబెట్టిన ఎండుద్రాక్షను తినాలి, ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది మరియు మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల పొట్టను శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఎనిమిది నుంచి పది నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలి. ఇందులో పొటాషియం, పీచు పుష్కలంగా ఉండటం వల్ల బీపీని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.