
భారత్, శీలంక మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక జట్టు 160 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 2 పరుగుల తేడాతో ఉత్కంఠ భరితమైన విజయం అందుకుని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.

ఈ విజయంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును హార్దిక్ పాండ్యా బద్దలు కొట్టాడు.

తొలి ఓటమికి ముందు అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్న రోజుల్లో 4 మ్యాచ్ల విజయాన్ని అందుకున్నాడు. ఆపై 2018లో రోహిత్ శర్మ సారథ్యంలో శ్రీలంకపై టీమిండియా తొలి ఓటమిని చవిచూసింది.

అయితే శ్రీలంకపై టీమిండియా మ్యాచ్ గెలవడంతో హార్దిక్ పాండ్యా వరుసగా 5 మ్యాచ్లు గెలిచి కెప్టెన్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తం 6 మ్యాచ్ల్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన పాండ్యా ఎప్పుడూ ఓటమి రుచి చూడలేదు. ఇందులో 5 విజయాలు నమోదు కాగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

శ్రీలంకపై థ్రిల్లింగ్ విజయంతో పాండ్యా వరుసగా 5 మ్యాచ్లలో టీమ్ ఇండియాను విజయవంతంగా నడిపించాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న 4 వరుస విజయాల రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు.