
రోజురోజుకూ బంగారం, వెండి ఆభరణాలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారి పోతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యే బంగారం, వెండి ధరలు భారీ పెరిగాయి. శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ.1,40,030 ఉండగా ప్రస్తుతం రూ. 1,41,220గా కొనసాగుతుంది. అంటే కేవలం మూడు గంటల్లోనే గంగారం ధర రూ.1,190 పెరిగింది.

ఇక వెండి సైతం బంగారం బాటలోనే నడుస్తుంది. రోజురోజుకు వెండి ధరలు సైతం రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో బంగారం కొనలేని సామాన్యులు వెండిననైనా కొందాం అనుకుంటే.. ఇప్పుడు అధి కూడా వాళ్లకు అందకుండా పోతుంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రెండున్నర లక్షలు దాటి ఆల్టైం హైకి చేరుకుంది. కేజీ వెండి ప్రస్తుతం రూ.2,74,000గా కొనసాగుతుంది.

తాజాగా పెరిగిన రేట్ల ప్రకారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్లో 24 కారెట్ల తులం బంగారం ధర రూ.రూ. 1,41,220గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,74,000గా పలుకుతుంది.

ఇక విశాఖపట్నం, కేరళ, కోల్కతా, బెంగళూరులో సైతం హైదరాబాద్ తరహా రేట్టు కొనసాగుతుండగా.. అటు దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,370గా కొనసాగుతుంది. 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,29,600గా కొనసాగుతుంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.141820గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,000లకు చేరుకుంది

అయితే ఈ రేట్లన్ని కేవలం ఈ వార్త రాసేటప్పి మాత్రమే అందుబాలో ఉన్నవి.. ఇవి తర్వాత పెరగవచ్చు, లేదా తగ్గ వచ్చు. గోల్డ్ రేట్లు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డాలర్ విలువ అనేది విలువైన లోహాలు ధరల ఎప్పటికప్పుడూ ప్రభావితం చేస్తుంది. కాబట్టి డాలర్ విలువ పెరిగితే బంగారం రేట్లు తగ్గుతాయి. ఒకవేళ డాలర్ విలువ పడిపోతే బంగారం రేట్లు పుంజుకుంటాయి.