
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్లలో ఉండే పొటాషియం నుండి సిట్రస్ పండ్లలోని విటమిన్ సి వరకు ప్రతిదీ మన శరీరాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాదు, రోగనిరోధక శక్తీ కూడా పెరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్స్ : బెర్రీలు, సిట్రస్, ఆకుకూరల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వాపు వంటి సమస్యలకు చెక్ పెడుతోంది. అంతే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ : సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవి అంటువ్యాధుల మీద పోరాడి శరీరానికి రక్షణగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థలో ఉండే తెల్ల రక్త కణాల ఉత్పత్తితో పాటు పనితీరును కూడా పెంచుతుంది.

బరువు : పండ్లలో ఉండే సహజ చక్కెరలు అదనపు చక్కెరలు వాడకుండా లేకుండా తీపి అనుభూతినిస్తాయి. అంతే కాదు, ఇవి బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

మెరుగైన జీర్ణ ఆరోగ్యం: పండ్లు, కూరగాయలు ఫైబర్తో నిండి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రేగు సమ్యసలకు చెక్ పెడుతుంది. చాలా మంది మనలో మల బద్దకంతో బాధ పడుతుంటారు. అలాంటి వారు వారంలో 3 సార్లు పండ్లను తీసుకోవాలి. దీని వలన ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.