
రక్తహీనతను చిటికెలో తగ్గించే ఈ నేచురల్ పొడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి తింటే ఏడాది పొడవునా తాజాగా ఉంటుంది. ఎక్కువ కూడా అవసరం లేదు ఒక్క చెంచాడు చాలు.. ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది. మరి లేట్ చేయకుండా అది ఏంటి ? దానిని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

మీరు ముందుగా మంచి ఎండు ఖర్జూరాలను తీసుకుని, వాటి నుంచి గింజలను తీసివేసి ఖర్జూరాలను పొడి క్లాత్ తో మంచిగా తుడిచి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఒకవేళ మీరు వీటిని నీటితో కడగాలి అనుకుంటే కడిగిన తరవాత వీటిని కొద్దిగా కూడా తడి తేమ లేకుండా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

ఆ తర్వాత వీటిని తీసుకుని బుడ్డి బుడ్డి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దీ సేపటి తరవాత ఒక ప్లేట్లో పెట్టి నాలుగు రోజుల పాటు వీటిని బాగా ఆరబెట్టాలి. వీటిలో కొద్దిగా కూడా తేమ లేకుండా బాగా గట్టిగా అయ్యాక మిక్సీ లో మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే కొన్ని నెలల పాటు తాజాగా ఉంటుంది.

ఇలా చేసుకున్న ఎండు ఖర్జూరం పొడిని ఫ్యాన్ కింద వీటిని చల్లార్చి, గాలి కూడా వెళ్లని ఒక డబ్బాలో వీటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని మీరు పాలు, రాగి జావ, లడ్డూలతో కూడా దీనిని తీసుకోవచ్చు. ఇంకా దీనిని మీ ఇంట్లోనే తయారు చేసుకుని ఈ పొడిని మీరు కుక్ చేసుకునే వంటల్లో కూడా సహజమైన తీపి, మంచి టేస్ట్ ఇస్తుంది.

ఈ పొడిని నిల్వ చేయాలి అనుకుంటే వీటిలో తడి లేకుండా చూసుకోవాలి. అలాగే తేమ ఉంటే పాడయ్యే అవకాశం ఉంది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)