
శీతాకాలంలో కొన్ని రకాల ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి, వేడిగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన ఆహారాలను ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడిచేసి తింటే ఏమవుతుందో తెలుసా..?

బంగాళాదుంపలు, లేదా పుట్టగొడుగుతో వండిన వంటకాలను మళ్లీ వేడి చేసి తింటే అనారోగ్యానికి గురవుతారు.

చికెన్, మటన వంటి మాంసాహారాలను మళ్లీ వేడి చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

కోడిగుడ్లను కూడా మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని ప్రొటీన్లు విషంగా మరే అవకాశం ఉంది.

చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్లను కూడా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు హెచ్చిరిస్తున్నారు.