
టాలెంటెడ్ నటులు ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు చిత్రం కల్కి 2898 ఏడీ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలో 2024 మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగష్టు 15, 2024న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించడంతో టీం ఇతర రిలీజ్ డేట్స్ కోసం వెతుకుతున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా వైజయంతీ మూవీస్ సమర్పణలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఇతిహాసానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హాలీవుడ్ లో రేంజ్ లో సినిమా లుక్స్ ఆకట్టుకున్నాయి. సలార్ మూవీ తర్వాత ఈ మూవీతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక పుష్ప2 మూవీ కూడా విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో కల్కీ వాయిదా పడుతుందనే రూమర్స్ అభిమానులకు షాక్ ఇచ్చే అంశం. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు.