
చాలా మందికి మతి మరుపు సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఇంట్లో ఒక దగ్గర పెట్టిన వస్తువులను మర్చిపోవడం. ఇంట్లోకి అవసరం అయ్యే వస్తువుల గుర్తుకు ఉండకపోవడం. ఇలా చిన్న చిన్న పనులను మర్చిపోతూ ఉంటారు. అలాగే పిల్లల్లో కూడా మతి మరుపు సమస్య ఉంటుంది. చదివింది అస్సలు గుర్తుండదు.

కానీ ఆరోగ్యం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలను అయినా తరిమి కొట్టవచ్చు. మతి మరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. మీ డైట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే.. బ్రెయిన్ షార్ప్ అవుతుంది.

మెదడు చక్కగా పని చేయాలంటే.. జింక్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరమవుతాయి. కడుపుతో ఉండేవారు ఈ ఆహారాలు తీసుకుంటే పుట్టే పిల్లు తెలివిగా పుడతారు.

పొద్దు తిరుగుడు పప్పులు, నువ్వుల, బాదం, అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్ నట్స్లో జింక్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చక్కగా లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీ డైట్లో ఇవి ఉండేలా చూసుకోండి.

వీటిని తీసుకోవడం వల్ల మార్కెట్లో లభ్యమయ్యే ఎలాంటి రసాయనిక ప్రోడెక్ట్స్ వాడాల్సిన పని లేదు. వీటితో పాటు ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల బ్రెయిన్ పవర్ ఫుల్గా పని చేస్తుంది.