
మొదటగా స్ప్రౌట్స్ ఛాట్, దీన్ని రెడీచేసేకోవడం చాలా ఈజీ.. ఇందుకో మీకు మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలు, ఉల్లి తరుగు, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొదటగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని.. మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలు, ముందుగానే మరు తరతిగిపెట్టుకున్న కూరగాయల తురుము ఇందులో యాడ్ చేయండి. తర్వాత గినంత ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని బాగా కలపండి. టేస్ట్ చూసుకొని ఉప్పు కారం, సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అన్ని ఓకే అనుకుంటే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరి.. టేస్టీ టేస్టీ స్ప్రౌట్స్ ఛాట్ రెడీ అయినట్టే. దీన్ని మీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకి ఇవ్వండి.

మరమరాల మసాలా మిక్స్: దీని కోసం మీకు కొన్ని మురమురాలు, ఇంట్లో ఉండే ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం ఉంటే సరిపోతుంది. ఇందులో ఉన్న కూరగాయలను చిన్నగా తరుముకొని ఒక ప్లేట్లో పక్కకు తీసి ఉంచుకోంఇ. ఆ తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ముందుగా మురమురాలు వేసి.. దానిలో మీరు ముందుగా కట్చేసి పెట్టుకున్న కూరగాయల తురుము వేయండి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పల్లీల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత స్టౌపై చిన్న పాత్రవేసి తాలింపు వేసి అందులో ఈ మిక్స్ను వేసి కలపండి అంతే మీకు మరమరాల ఛాట్ రెడీ అయినట్టే.

రవ్వ దోశ: పిల్లలకు దోశలు అంటే ఎంతో ఇష్టం. మీరు త్వరగా వాళ్లకు దోశలు ఇవ్వాలంటే ఉప్మా రవ్వదోశ చాలా బెటర్. ఇందుకోసం మీకు ఉప్మారవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అవసరం అవుతుంది. ఇది తయారు చేసేందుకు ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో రవ్వ, బియ్యం పిండి తగినన్ని వాటర్ వేసి కలపండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. అది కలిసిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు తురుము వేసి బాటా కలపండి. ఆ పేస్ట్ను పెనంపై దోశల్లా వేసుకొండి.

కాజూ పోహా: పిల్లల బ్రేక్ఫాస్ట్లోకి ఇది చాలా హెల్దీ ఫుడ్. దీనికి కావాలసిన పదార్థాలు అటుకులు, ఉల్లి, బంగాళదుంప, పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పులు, పల్లీలు, కరివేపాకు, వీటన్నింటి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత కూరగాయలను సన్నగా కట్చేసుకొని ఉంచుకోండి. తర్వాత ఆటుకులను వేడి నీటిలో వడకట్టి పెట్టుకోండి. ఇక దీన్ని తయారు చేసేందుకు ముందుగా స్టౌ పై ప్యాన్ పెట్టి అందులో కొన్ని ఆయిల్ వేసి.. ఇంట్లో ఉండే ఆవాలు, శనగపప్పు, పల్లీలు, కాజూ వేసి వేగించండి. తర్వాత ముందుగా కచ్చేసి పెట్టుకన్న కూరగాయల తరుగులను వేయండి. అవి వేగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం, అల్లం, మసాలా వేసి కలపండి. తర్వాత అటుకు యాడ్ చేసి కలిపి లో ఫ్లేమ్లో వేయించండి. తర్వాత నిమ్మరసం, కోత్తమీర, ఉల్లి తరుగు యాడ్ చేసికుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి కాజూ పోహా రెడీ.

వెజిటేబుల్ అమ్లెట్ ఇది తయారు చేసుకునేందుకు. మనకు అరకప్పు శనగపిండి, టేబుల్ స్పూన్ బియ్యం పిండి, సన్నగా తరిగిన టొమాటో, క్యారెట్లు , క్యాబేజీ, క్యాప్సికం, పచ్చిమిర్చి,-కొత్తిమీర ఉంటే సరిపోతుంది. ఇది తయారు చేసేందుకు ముందుగా ఒక పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసి బాబా మిక్స్ చేయండి. దానిలో కొన్ని వాటర్ వేసి.. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయాలు యాడ్ చేసిండి. దాన్ని బాగా కలిపి దోశల పిండిలా రెడీ చేసుకోండి తర్వాత దాన్ని అమ్లె్ట్ మాదిరి పెనంపై వేసి రెండు వైపులా బాగా కాల్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దానికి ఏదైనా చట్నీతో తింటే అదిరిపోతుంది.