
రక్తహీనత ఉన్నవారు క్యారెట్ జ్యూస్లో తేనె కలిపి సేవిస్తే రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్, టమాటా జ్యూస్, చీనీపండ్ల జ్యూస్ని కలిపి కనీసం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిని కలిపిన రసాన్ని రెండు నెలలపాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయమవుతాయి.

నిద్రలేమితో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం-సాయంత్రం రెండుపూటలా క్యారెట్ జ్యూస్ తీసుకోవటం వల్ల మీరు ఊహించని ఫలితం వుంటుంది. క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే.. ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్దకం దూరమవుతాయి.

క్యారెట్ను ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత కప్పు రసంలో చెంచా తేనెను కలిపి సేవిస్తే గుండెల్లో మంట మటుమాయం అవుతుంది. క్యారెట్ జ్యూస్ మహిళలల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది.

పరగడుపున క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల దానిలోని పోషకాలు శరీరం బాగా గ్రహించబడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మీకు ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం కుదరకపోతే, భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేశాక రెండు గంటల తర్వాత కూడా తాగవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్ జ్యూస్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.