ఎంత ఉన్నవారికైనా.. ఎంత లేనివారికైనా అప్పులు ఉండటం అనేది సహజం. అప్పు లేని మనిషి అనేవాడే ఉండడు. అయితే ఒక్కోసారి మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటాడు. అందులోంచి బయట పడటం ఒకరకంగా చాలా కష్టం. ఎంత తీర్చినా కూడా అప్పుల బాధ నుంచి బయట పడలేక పోతున్నారు.. ఇలా చేస్తే.. వాటి నుంచి బయట పడొచ్చు.
అప్పుల బాధల నుంచి త్వరగా బయట పడాలి అనుకునే వారు ప్రతి రోజూ స్పటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలి. మీ పూజ గదిలో స్పటిక గణపతిని ఉంచి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి.
అప్పుల నుంచి బయట పడాలంటే.. లక్ష్మీ దేవి బొమ్మ ఉండే గొలుసులను మహిళలు ధరించాలి. అలాగే కుడి చేతికి కూడా లక్ష్మీ దేవి ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుందట.
అలాగే వెండితో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొని.. తమ స్థోమతకు తగిన విధంగా ఆ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండగా.. తప్పకుండా ఫలితం లభిస్తుంది. అలాగే వెండి లక్ష్మీ దేవిని లేని వారికి దానం చేయాలి.
అప్పుల ఊబి నుంచి త్వరగా బయట పడాలి అనుకునేవారు.. తమ పుట్టింటి నుంచి లేదా తమ పుట్టింటికి చెందిన వారి ఇంటి నుంచి రెండు ప్రమిదలు మట్టివి లేదా ఎలాంటి లోహాలవి అయినా తీసుకొచ్చి.. అందులో నూనె పోసి.. లక్ష్మీ దేవికి పూజ చేయాలి.