
ఇంట్లో ఫ్రిజ్ వచ్చాక చాలా మంది గృహిణులకు పని ఈజీ అయ్యిందనే చెప్పాలి. ఫ్రిజ్ ఇంట్లో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే కొన్నింటిని మాత్రం ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు. వాటిల్లో పండ్లు చాలానే ఉన్నాయి. వీటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచడం వల్ల పాడైపోతాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రిజ్ ఉంది కదా అని ఏవి పడితే అవి ఫ్రిజ్లో పెట్టకూడదు. ఇలా ఫ్రిజ్లో పెట్టకూడని వాటిల్లో సిట్రస్ పండ్లు కూడా ఒకటి. నిమ్మకాయ, నారింజ, ఆరెంజ్ వంటి పండ్లు ఫ్రిజ్లో ఉంచకూడదు. వీటి వల్ల ఇవి రుచిని కోలప్పోతాయి. అయితే వీటి నుంచి తీసిన రసాలను మాత్రం స్టోర్ చేసుకోవచ్చు.

చాలా మంది పైనాపిల్ను కూడా ఫ్రిజ్లో ఉంచుతారు. కానీ పైనాపిల్ను అస్సలు ఫ్రిజ్లో ఉంచకూడదన్న విషయం చాలా మందికి తెలియదు. ఫ్రిజ్లో పైనాపిల్ ఉంచడం వల్ల రుచి లేకుండా, పొడిగా తయారవుతుంది. అయితే పండ్లు బాగా మగ్గిన తర్వాత కట్ చేసిన ముక్కలు ఫ్రిజ్లోలో ఉంచవచ్చు.

అవకాడోను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. అందులోనూ పండనివి అస్సలు ఉంచకూడదు. దీని వలన అవకాడో రుచి పూర్తిగా కోలపోతుంది. చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఇది పండిన తర్వాత మాత్రం ఫ్రిజ్లో ఉంచవచ్చు. అదేవిధంగా టమాటాలను కూడా ఫ్రిజ్లో ఉంచకూడదు.

అదే విధంగా ద్రాక్ష పండ్లను కూడా ఫ్రిజ్లో నిల్వ చేయాల్సి పని లేదు. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద మూలన ఓ బుట్టలో వేసి ఉంచితే సరిపోతుంది. ద్రాక్ష రసాన్ని మాత్రం ఫ్రిజ్లో ఉంచవచ్చు. ఇలా కొన్ని రకాల పండ్లు ఫ్రిజ్లో పెట్టడం వలన రుచిని, పోషకాలను కోల్పోతాయి. (NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)