ICC vs PCB: రూ. 2000000000.. IND vs PAK మ్యాచ్ జరగకపోతే ఐసీసీ బుర్ర కరాబే..?

Updated on: Feb 02, 2026 | 11:35 AM

IND vs PAK: ఏ ఐసీసీ ఈవెంట్‌లోనైనా, భారత జట్టు మ్యాచ్‌లు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, ఈ ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, మ్యాచ్ జరగకపోతే, నష్టాలు కూడా అంతే గణనీయంగా ఉంటాయి.

1 / 5
India vs Pakistan: టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగదు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్‌కు 6 రోజుల ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడబోమని ప్రకటించింది. ఈ నిర్ణయానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలను కారణమని పీసీబీ పేర్కొంది. పాకిస్తాన్ నిర్ణయం తర్వాత ఐసీసీ పీసీబీని హెచ్చరించింది. పీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఐసీసీ భారీ జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి 2 బిలియన్స్ ( రూ. 200 కోట్లు) వరకు నష్టపోవచ్చు అని తెలుస్తోంది.

India vs Pakistan: టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగదు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్‌కు 6 రోజుల ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడబోమని ప్రకటించింది. ఈ నిర్ణయానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలను కారణమని పీసీబీ పేర్కొంది. పాకిస్తాన్ నిర్ణయం తర్వాత ఐసీసీ పీసీబీని హెచ్చరించింది. పీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఐసీసీ భారీ జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి 2 బిలియన్స్ ( రూ. 200 కోట్లు) వరకు నష్టపోవచ్చు అని తెలుస్తోంది.

2 / 5
గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతి ఐసీసీ ఈవెంట్‌లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత ప్రీమియం ఈవెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఈ రెండు జట్లు తలపడే ఏకైక సమయం ఇదే. తత్ఫలితంగా, ఈ మ్యాచ్ చుట్టూ ఉత్సాహంతోపాటు ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతి ఐసీసీ ఈవెంట్‌లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అత్యంత ప్రీమియం ఈవెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఈ రెండు జట్లు తలపడే ఏకైక సమయం ఇదే. తత్ఫలితంగా, ఈ మ్యాచ్ చుట్టూ ఉత్సాహంతోపాటు ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

3 / 5
తత్ఫలితంగా, భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లు నిరంతరం ఐసీసీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జింజిపెడుతుంటాయి. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో షెడ్యూల్ చేసిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ల కారణంగా ఐసీసీ ప్రసారకుల నుంచి గణనీయమైన రుసుములను పొందుతుంది.

తత్ఫలితంగా, భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లు నిరంతరం ఐసీసీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జింజిపెడుతుంటాయి. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో షెడ్యూల్ చేసిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ల కారణంగా ఐసీసీ ప్రసారకుల నుంచి గణనీయమైన రుసుములను పొందుతుంది.

4 / 5
కానీ, ఈ మ్యాచ్ జరగకపోతే, టోర్నమెంట్‌లో అతిపెద్ద ప్రసార సంస్థ అయిన జియో - హాట్‌స్టార్ ఎటువంటి ఆదాయం ఉండదు. చివరికి ఈ మ్యాచ్‌కు రుసుము లభించకపోవడంతో ఇది ఐసీసీపై ప్రభావం చూపుతుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌లో టీమిండియా మ్యాచ్‌లు దాదాపు రూ. 100 కోట్లు సంపాదిస్తాయి. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఇది దాదాపు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే, భారత్ - పాకిస్తాన్ టీ20 మ్యాచ్ కోసం ప్రతి 10 - సెకన్ల ప్రకటనకు రేటు సాధారణంగా రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ నష్టం దాదాపు రూ. 200 కోట్లకు చేరుకుంటుంది.

కానీ, ఈ మ్యాచ్ జరగకపోతే, టోర్నమెంట్‌లో అతిపెద్ద ప్రసార సంస్థ అయిన జియో - హాట్‌స్టార్ ఎటువంటి ఆదాయం ఉండదు. చివరికి ఈ మ్యాచ్‌కు రుసుము లభించకపోవడంతో ఇది ఐసీసీపై ప్రభావం చూపుతుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌లో టీమిండియా మ్యాచ్‌లు దాదాపు రూ. 100 కోట్లు సంపాదిస్తాయి. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఇది దాదాపు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే, భారత్ - పాకిస్తాన్ టీ20 మ్యాచ్ కోసం ప్రతి 10 - సెకన్ల ప్రకటనకు రేటు సాధారణంగా రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ నష్టం దాదాపు రూ. 200 కోట్లకు చేరుకుంటుంది.

5 / 5
ఇప్పుడు ఐసీసీకి అలాంటి నష్టం జరిగితే, అది ఆదాయ భాగస్వామ్య నమూనాపై ప్రభావం చూపుతుంది. బీసీసీఐ, పీసీబీతో సహా అన్ని క్రికెట్ బోర్డుల ఆదాయాలపై ప్రభావం చూపుతుంది. ఇది ఇప్పటికే సంపన్నమైన బీసీసీఐకి గణనీయమైన మార్పు చూపించకపోవచ్చు. కానీ, ఇది పీసీబీతోపాటు ఇతర బోర్డులకు గణనీయమైన నష్టం కావొచ్చు. ఓ నివేదిక మేరకు, మ్యాచ్ రద్దు అయిన సందర్భంలో, శిక్షగా జరిగిన నష్టాలకు ఐసీసీ ప్రసారకుడికి పరిహారం చెల్లించమని పీసీబీ బలవంతం చేయవచ్చు.

ఇప్పుడు ఐసీసీకి అలాంటి నష్టం జరిగితే, అది ఆదాయ భాగస్వామ్య నమూనాపై ప్రభావం చూపుతుంది. బీసీసీఐ, పీసీబీతో సహా అన్ని క్రికెట్ బోర్డుల ఆదాయాలపై ప్రభావం చూపుతుంది. ఇది ఇప్పటికే సంపన్నమైన బీసీసీఐకి గణనీయమైన మార్పు చూపించకపోవచ్చు. కానీ, ఇది పీసీబీతోపాటు ఇతర బోర్డులకు గణనీయమైన నష్టం కావొచ్చు. ఓ నివేదిక మేరకు, మ్యాచ్ రద్దు అయిన సందర్భంలో, శిక్షగా జరిగిన నష్టాలకు ఐసీసీ ప్రసారకుడికి పరిహారం చెల్లించమని పీసీబీ బలవంతం చేయవచ్చు.