భారత మాజీ పేసర్ శాంతకుమారన్ శ్రీశాంత్ క్రికెట్ కెరీర్కు విరామం ఇచ్చి ఏడాది మాత్రమే అయింది. ఐపీఎల్ 2013 సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న తర్వాత, అతను మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కనిపించలేదు. సరిగ్గా పదేళ్ల తర్వాత శ్రీశాంత్ మళ్లీ ఐపీఎల్లోకి వస్తున్నాడు. కానీ ఒకే తేడా ఏమిటంటే, ఈసారి కొత్త అవతారంలో. అదెలా అంటే..?
అవును, ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, లీగ్ టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ తన ప్యానెల్ చర్చా సభ్యుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎస్. శ్రీశాంత్ పేరు కూడా ఉండడం విశేషం.
అంటే ఈ ఐపీఎల్ సమయంలో స్టార్ స్పోర్ట్స్ మలయాళ ఛానెల్లో శ్రీశాంత్ వ్యూయర్ అనలిస్ట్గా కనిపించనున్నాడు. దీని ద్వారా 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు శ్రీశాంత్ సిద్ధమయ్యాడు.
శ్రీశాంత్తో పాటు ఈసారి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్లో జాక్వెస్ కలిస్, ఆరోన్ ఫించ్, కెవిన్ పీటర్సన్, టామ్ మూడీ, ఇర్ఫాన్ పఠాన్, పాల్ కాలింగ్వుడ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ కూడా కనిపించనున్నారు.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కొచ్చిన్ టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున మొత్తం 44 మ్యాచ్లు ఆడిన శ్రీశాంత్ 40 వికెట్లు పడగొట్టాడు. కాగా, 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడ్డాడు.
ఆ తర్వాత శ్రీశాంత్పై ఐపీఎల్ నిషేధం పడింది. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా మళ్లీ ఐపీఎల్లో దర్శనమిస్తున్నాడు. మరోవైపు గతేడాది సరిగ్గా మార్చిలోనే శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.