- Telugu News Photo Gallery Cricket photos India Vs England Third Test predicted Playing Eleven Virat kohli, Joe Root
Ind Vs Eng: మూడో టెస్టుకు టీమిండియాలో రెండు మార్పులు.. ఆ ఇద్దరికి ఉద్వాసన.. ఎవరంటే!
మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా గెలుపే ధ్యేయంగా..
Updated on: Aug 24, 2021 | 5:32 PM

మరికొన్ని గంటల్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలవాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర కసరత్తులు చేస్తోంది.

ఇదిలా ఉంటే టీమిండియా రెండు మార్పులతో హెడింగ్లీ టెస్టుకు సిద్దమైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్తో పాటు యువ బౌలర్కు టీం మేనేజ్మెంట్ జట్టులో చోటు కల్పించింది. అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ స్థానాల్లో ఈ ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నారు.

టీమిండియా(అంచనా): విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్, అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

ఇంగ్లాండ్(అంచనా): జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్స్టో, బర్న్స్, బట్లర్, హమీద్, మహమ్మద్, డేవిడ్ మాలన్, ఓవర్టన్, రాబిన్సన్, సామ్ కర్రన్





























