- Telugu News Photo Gallery Cricket photos India vs australia 2nd t20i harmanpreet kaur becomes first indian to win t20i most wins as a captain ms dhoni virat kohli rohit sharma
IND vs AUS: చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ కౌర్.. ధోనీ, విరాట్, రోహిత్ కూడా వెనుకంజలోనే.. తొలి భారత సారథిగా రికార్డ్..
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దీంతో హర్మన్ప్రీత్ విన్నింగ్లో హాఫ్ సెంచరీ కూడా చేసింది.
Updated on: Dec 12, 2022 | 8:51 AM

ఆస్ట్రేలియా అహంకారాన్ని భారత మహిళల జట్టు దెబ్బతీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా అజేయ ప్రయాణానికి భారత్ బ్రేక్ వేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వరుసగా 16 టీ20 మ్యాచ్లు గెలిచింది. అయితే 17వ మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడించి భారత జట్టు ఆసీస్ ప్రయాణానికి అడ్డుకట్ట వేసింది. ఆస్ట్రేలియాపై ఈ భారీ విజయంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆమె పక్కన నిలవలేకపోయారు.

అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు గెలిచిన భారత కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ నిలిచింది. ఆమె కెప్టెన్సీలో భారత్ 50 టీ20 మ్యాచ్లు గెలిచింది. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ 41 టీ20 మ్యాచ్లు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో 39 మ్యాచ్లు గెలిచాడు. అదే సమయంలో కోహ్లి సారథ్యంలో భారత్ 30 టీ20 మ్యాచ్లు గెలిచింది.

ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ 21 పరుగులు చేసింది. కానీ, తన అద్భుతమైన వ్యూహంతో ఆస్ట్రేలియా జట్టు నుంచి విజయాన్ని లాగేసుకుంది.

5. మహేంద్ర సింగ్ ధోని: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 297 వన్డే ఇన్నింగ్స్ల్లో మొత్తం 229 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన 2వ భారత బ్యాట్స్మెన్గా నిలిచిన ధోని.. ఈ జాబితాలో 5 స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు 51 టీ20 మ్యాచ్లకు సారథ్యం వహించగా, 39 మ్యాచ్లు గెలిచి, 12 మ్యాచ్ల్లో ఓడాడు.

అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, భారత్ 50 టీ20 మ్యాచ్లు ఆడింది. 30 గెలిచింది. 16 మ్యాచ్లు ఓడింది. 2 మ్యాచ్లు టై కాగా, 2 మ్యాచ్ల్లో ఫలితాలు రాలేదు.




