
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అతని నాయకత్వంలో ODI-T20 సిరీస్లో భారతదేశం స్థిరమైన విజయాలను అందుకుంటుంది. వీటన్నింటితో పాటు, రోహిత్ బ్యాట్తో కూడా తన అద్భుతాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టీ20 ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. (ఫోటో: BCCI)

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఫిబ్రవరి 24, గురువారం, న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్టిల్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కునెట్టిన రోహిత్ శర్మ.. శ్రీలంక మ్యాచులో అత్యధిక పరుగుల రికార్డును సాధించాడు. రోహిత్ ప్రస్తుతం 123 మ్యాచ్లలో 115 ఇన్నింగ్స్లలో 33 సగటు, 140 స్ట్రైక్ రేట్తో 3307 పరుగులు చేశాడు. (ఫోటో: BCCI)

అత్యధిక పరుగుల రేసులో, రోహిత్, గప్టిల్, కోహ్లీ మధ్య రేసు కొనసాగుతుంది. ముగ్గురి మధ్య పెద్దగా తేడా లేదు. 108 ఇన్నింగ్స్లలో 3299 పరుగులు చేసిన రోహిత్ తర్వాత గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, చాలా కాలం పాటు ఈ రికార్డును కలిగి ఉన్న కోహ్లి 89 ఇన్నింగ్స్లలో 3296 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. (ఫోటో: AFP/BCCI)

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ చక్కటి ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు. అతను 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 44 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్తో కలిసి రోహిత్ తొలి వికెట్కు 11.5 ఓవర్లలో 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. లహిరు కుమార బౌలింగ్లో రోహిత్ అవుటయ్యాడు. (ఫోటో: BCCI)