
IND vs SL, Asia Cup 2023 Final: భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజృంభిస్తే.. సచిన్ పేరిట ఉన్న ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఇందుకోసం రోహిత్ మరో 33 పరుగులు చేస్తే చాలు.

అవును, ఆసియా కప్(వన్డే ) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున 23 వన్డే మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ 2 సెంచరీలు, 7 అర్థ సెంచరీలతో మొత్తం 971 పరుగులు చేశాడు.

అయితే ఆసియా కప్లో భారత్ తరఫున ఇప్పటివరకు 939 పరుగులు చేసిన రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇందుకోసం 27 వన్డేలు ఆడిన రోహిత్.. టోర్నీలో ఓ సెంచరీ, 9 అర్థ సెంచరీలు కూడా చేశాడు.

అంటే సచిన్ రికార్డ్ను బ్రేక్ చేసేందుకు రోహిత్ శర్మ నేడు జరిగే ఫైనల్లో మరో 33 పరుగలు చేస్తే చాలు. ఫలితంగా ఆసియా కప్(వన్డే ) టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించడంతో పాటు సచిన్ని అధిగమిస్తాడు.

విశేషం ఏమిటంటే.. ఆసియా కప్ (వన్డే) టోర్నీలో సచిన్ 971, రోహిత్ 939 పరుగులు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరికీ సమీపంలో ఎవరూ లేరు. 15 మ్యాచ్ల్లో 4 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో 742 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వీరిద్దరికీ చాలా దూరంలో ఉన్నట్లే. నేటి మ్యాచ్లో కోహ్లీ కనీసం 229 పరుగులు చేస్తేనే సచిన్ని అధిగమించగలడు.