భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్లో లేడు. కానీ, అతని బ్యాట్ నుంచి వచ్చే పరుగులతో.. విరాట్ ఖాతాలో మరికొన్ని రికార్డులు నమోదు చేయబోతున్నాయి. ఓవల్ టెస్ట్ మొదటి రోజు కోహ్లీ ఓ రికార్డును సృష్టించాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్లో ఫోర్తో తన ఖాతాను తెరిచాడు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తన 23,000 పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ కేవలం 490 ఇన్నింగ్స్లలో ఈ స్థానాన్ని సాధించాడు. అత్యంత వేగంగా 23,000 పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు.
ఈ విషయంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా విరాట్ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 522 ఇన్నింగ్స్లలో 23,000 పరుగులు సాధించాడు. సచిన్ మొత్తం మీద 34 వేలకు పైగా పరుగులు చేశాడు.
సచిన్తో పాటు, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు ఈ లిస్టులో ఉంది. పాంటింగ్ 544 ఇన్నింగ్స్లలో 23,000 పరుగులు చేశాడు. పాంటింగ్ 27 వేలకు పైగా పరుగులు సాధించాడు.
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లీస్ టాప్ 5 బ్యాట్స్మెన్లో నిలిచాడు. 551 ఇన్నింగ్స్లో 23వేల పరుగులు సాధించాడు. తన సుదీర్ఘ కెరీర్లో 25 వేలకు పైగా పరుగులు చేశాడు.
ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ 23,000 పరుగులు సాధించడానికి 568 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. అతని కెరీర్ ముగిసే వరకు 28 వేలకు పైగా పరుగులు సాధించాడు.