ఓవల్ టెస్టులో ఒక్క రోజే మిగిలి ఉంది. కానీ, మ్యాచ్లో విజేత భారత్ అంటూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. టీమిండియా ఇప్పటికీ తన రెండో ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ కూడా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే ఈ 3 కారణాలతో టీమిండియా విజయం సాధిస్తుందని అంటున్నారు. ఉన్నాయి.
ఓవల్ టెస్టులో టీమిండియా 320 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్కు ఈ టార్గెట్ చాలా దూరంలో ఉంది. ఎందుకంటే 1977-78 నుంచి భారత్పై 300 కంటే ఎక్కువ పరుగులు లేదా 276 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 44 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చివరిసారిగా పెర్త్ టెస్ట్లో భారత్పై 342 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
ఈ మైదానంలో నాల్గవ ఇన్నింగ్స్లో అత్యధికంగా 263 పరుగుల ఛేజింగ్గా రికార్డు నెలకొంది. భారతదేశ ప్రస్తుత ఆధిక్యం దీని కంటే చాలా ఎక్కువ. అంటే, ఇంగ్లండ్ కోసం ఈ టెస్ట్ గెలవాలంటే, చరిత్రను మార్చాల్సి ఉంటుంది.
ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా మధ్య 153 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇది రెండో శతక భాగస్వామ్యం. అంతకుముందు 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ రెండు సందర్భాలలో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్టులో భారత్ విజయం సాధించింది. అంటే, రోహిత్-పుజారా సెంచరీ భాగస్వామ్యానికి తోడు హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి 127 లక్కీ నంబర్గా తీసుకుంటే ఓవల్లో భారత్ విజయం ఖాయమని అంటున్నారు.