India T20I Team: భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక.. రోహిత్ వారసుడిగా ఆయన ఫిక్స్..!

|

Jul 16, 2024 | 5:08 PM

Hardik Pandya: రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా ఫిక్స్ అయినట్లు సమాచారం వస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కనిపించిన పాండ్యాకు టీ20 జట్టు కెప్టెన్సీని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం శ్రీలంకతో జరిగే సిరీస్‌లో భారత్ టీ20 జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా కనిపించనున్నాడు.

1 / 5
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి వచ్చింది.

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి వచ్చింది.

2 / 5
పీటీఐ ప్రకారం, సెలక్షన్ కమిటీ ఇప్పుడు హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించింది. దీంతో టీమిండియా టీ20 జట్టుకు పాండ్యా శాశ్వత కెప్టెన్‌గా కనిపించడం ఖాయమైంది.

పీటీఐ ప్రకారం, సెలక్షన్ కమిటీ ఇప్పుడు హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించింది. దీంతో టీమిండియా టీ20 జట్టుకు పాండ్యా శాశ్వత కెప్టెన్‌గా కనిపించడం ఖాయమైంది.

3 / 5
ఇంతకు ముందు కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యాతో పాటు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యాను కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. తదనుగుణంగా రాబోయే టీ20 సిరీస్‌లో పాండ్యా భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఇంతకు ముందు కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యాతో పాటు జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు హార్దిక్ పాండ్యాను కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. తదనుగుణంగా రాబోయే టీ20 సిరీస్‌లో పాండ్యా భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

4 / 5
జులై 27 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి కెప్టెన్‌గా అరంగేట్రం చేయనున్నాడు. అయితే వచ్చే ఏడాది వరకు రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

జులై 27 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి కెప్టెన్‌గా అరంగేట్రం చేయనున్నాడు. అయితే వచ్చే ఏడాది వరకు రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

5 / 5
హార్దిక్ పాండ్యా 16 టీ20 మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలో టీమిండియా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే ప్రస్తుత ఆటగాళ్లలో టీ20 జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం పాండ్యాకే ఉంది. దీంతో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైంది.

హార్దిక్ పాండ్యా 16 టీ20 మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలో టీమిండియా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే ప్రస్తుత ఆటగాళ్లలో టీ20 జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం పాండ్యాకే ఉంది. దీంతో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైంది.