IND vs WI: కోహ్లీ రికార్డ్‌ని సమం చేసిన హార్దిక్.. సురేష్ రైనా తర్వాత రెండో ప్లేయర్‌గా తిలక్ వర్మ.. వివరాలివే..

|

Aug 09, 2023 | 10:18 AM

IND vs WI 3rd T20I: భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయమైన 49 పరుగులతో రాణించారు. ఇక సూర్య పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా విన్నింగ్ సిక్సర్ బాది సిరీస్‌లో భారత్‌ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా హార్దిక్.. విరాట్ కోహ్లీకి సొంతమైన ఓ రికార్డ్‌ను సమం చేశాడు. అలాగే అజేయంగా 49 పరుగులు చేసిన తిలక్.. సురేష్ రైనా సరసన చేరాడు.

1 / 5
భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు. 

భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 20 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కోహ్లీ రికార్డ్‌ను సమం చేశాడు. 

2 / 5
మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్‌ కొట్టి భారత్‌ని గెలిపించాడు. విరాట్ కోహ్లీ గతంలో ఇలా 4 సార్లు సిక్సర్ కొట్టి మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించాడు.

మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సిక్సర్‌ కొట్టి భారత్‌ని గెలిపించాడు. విరాట్ కోహ్లీ గతంలో ఇలా 4 సార్లు సిక్సర్ కొట్టి మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించాడు.

3 / 5
తాజాగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన హార్దిక్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది నాల్గో సారి మ్యాచ్‌ని గెలిపించాడు. దీంతో కోహ్లీ విన్నింగ్ సిక్సర్ల రికార్డ్‌ని పాండ్యా సమం చేశాడు. 

తాజాగా జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ కొట్టిన హార్దిక్ కూడా విన్నింగ్ సిక్సర్ బాది నాల్గో సారి మ్యాచ్‌ని గెలిపించాడు. దీంతో కోహ్లీ విన్నింగ్ సిక్సర్ల రికార్డ్‌ని పాండ్యా సమం చేశాడు. 

4 / 5
ఇక ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ విండీస్ బౌలర్లపై చెలరేగాడు. 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ విండీస్ బౌలర్లపై చెలరేగాడు. 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. 

5 / 5
అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో 4వ నెంబర్‌లో 49 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. 2016లో సురేష్ రైనా కూడా 49 పరుగులతో నిలిచాడు. 

అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 బంతుల్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లో 4వ నెంబర్‌లో 49 పరుగుల వద్ద అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. 2016లో సురేష్ రైనా కూడా 49 పరుగులతో నిలిచాడు.