India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఈరోజు విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకున్నారు.
ఇటీవల విడుదల చేసిన కొత్త టెస్ట్ ఆల్రౌండర్ల జాబితాలో, భారత ఆల్ రౌండర్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న రవీంద్ర జడేజా ఐసీసీ ఆల్ రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
జడేజాతో పాటు, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా జాబితాలో భాగంగా ఉన్నారు. ముగ్గురు భారతీయ ఆటగాళ్లు టాప్ 5లో ఉన్నారు. అశ్విన్ 330 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ 281 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
అంతకుముందు అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు. కానీ, బెన్ స్టోక్స్ పేలవ ప్రదర్శనతో లాభపడిన అక్షర్.. స్టోక్స్ ను వెనక్కి నెట్టి పైకి వెళ్లాడు. తద్వారా ఆల్ రౌండర్ల జాబితాలో భారత్ పూర్తి ఆధిపత్యం కనిపిస్తోంది. దీన్ని బట్టి టీమిండియా విజయంలో ఆల్ రౌండర్ల సహకారం ఎంత ఉందో అర్థమవుతోంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో రవీంద్ర జడేజా సెంచరీ చేయడంతో పాటు ఈ మ్యాచ్లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. రాజ్కోట్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో 469 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అతని టెస్టు కెరీర్లో ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు.
ఈ ముగ్గురు మినహా, టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్లో భారత్కు చెందిన మరే ఇతర ఆటగాడు టాప్ 10 లేదా టాప్ 35లో లేరు. పేసర్ మహమ్మద్ షమీ 36వ స్థానంలో, బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ 37వ స్థానంలో ఉన్నారు.