
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఏ ధోని IPL 2024 లో మొదటిసారిగా అవుట్ అయ్యాడు.

11 బంతుల్లో 14 పరుగుల వద్ద ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. అంతకుముందు ధోని చివరి రెండు ఓవర్లలో ఒక సిక్స్, ఒక ఫోర్ సాధించాడు.

ఈరోజు మ్యాచ్కు ముందు వికెట్ కీపర్ కం బ్యాటర్ ధోని.. ఏడు మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచాడు. దాదాపు 260 స్ట్రైక్ రేట్ వద్ద 96 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.