మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలి భారీ ఇన్నింగ్స్లను ఆడడంలో విఫలమవుతున్నాడు. గతేడాది ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మాత్రమే ఆడుతున్నాడు. నేడు ఐపీఎల్ 2021 లో ధోని బ్యాట్ నుంచి పరుగుల వరద పారనుందని ఆశించవచ్చు. ఈ రోజు ధోని తాను ఆడుతున్న జట్టుపై గొప్ప బ్యాటింగ్ రికార్డును కలిగి ఉన్నాడు. ధోని సీఎస్కే టీం నేడు విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది
ఆర్సీబీకి వ్యతిరేకంగా ధోని నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్గా నమోదైంది. విరాట్ కోహ్లీ జట్టుపై మహీ బ్యాట్ 50 ఫోర్లు, 46 సిక్సర్లను బాదింది.
ఆర్సీబీకి వ్యతిరేకంగా ధోని ప్రదర్శన అద్భుతంగా ఉంది. కోహ్లీ టీంపై ధోని 28 ఇన్నింగ్స్లు ఆడాడు. ఇందులో అతను 41.25 సగటుతో 825 పరుగులు చేశాడు. ధోని ఆర్సీబీకి వ్యతిరేకంగా 141.50 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇది ధోని మొత్తం ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 136.52 కంటే ఎక్కువ ఉండడం విశేషం.
ఆర్సీబీకి వ్యతిరేకంగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మహి రెండవ స్థానంలో ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీతో జరిగిన 20 మ్యాచ్లలో వార్నర్ 877 పరుగులు చేశాడు. ధోనీ ఈ సీజన్లో ఆర్సీబీతో ఒక మ్యాచ్ ఆడాడు. కానీ, మహి బ్యాట్ నుంచి రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.
ధోని ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 212 మ్యాచ్లు ఆడాడు. 39.93 సగటుతో 4672 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 23 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో అతని అత్యధిక స్కోరు 84 నాటౌట్గా ఉంది. 2019 లో ఆర్సీబీకి వ్యతిరేకంగా ఈ అత్యధిక స్కోర్ చేశాడు.