
Asian Games 2023: నేపాల్తో జరిగిన ఆసియా క్రీడలు క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్లో యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీ చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేశాడు.

యశస్వీ 48 బంతుల్లోనే సాధించిన ఈ శతకం భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా కావడం విశేషం.

అలాగే నేపాల్పై సాధించిన ఈ సెంచరీతో యశస్వీ.. భారత్ తరఫున టీ20 శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డులను తిరగరాసి, అగ్రస్థానాన్ని అధిరోహించాడు.

గతంలో ఈ రికార్డ్ శుభమాన్ గిల్ పేరిట ఉండేది. 23 సంవత్సరాల 146 రోజుల వయసులో గిల్ టీ20 సెంచరీ చేయగా.. యశస్వీ 21 ఏళ్ల 279 రోజుల వయసులోనే ఈ ఫీట్ చేశాడు.

ఇలా అత్యంత పిన్న వయసులోనే టీ20 సెంచరీ చేసిన భారత్ ఆటగాళ్లుగా యశస్వీ అగ్రస్థానంలో, గిల్ రెండో స్థానంలో ఉండగా.. 23 ఏళ్ల 156 రోజుల వయసులోనే సెంచరీ చేసిన సురేష్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు.