
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ రోజును టీ, కాఫీకి బదులుగా హెల్తీ డ్రింక్స్తో ప్రారంభించండి. వీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

ఈ క్రమంలో మీరు ఉదయాన్నే పసుపు, మిరియాలన కలిపిన నీరు త్రాగవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు వేడి నీటిలో 2 చిటికెల పసుపు పొడి, మిరియాల పొడి వేసి కలపండి. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని కొవ్వును తొలగించడంతో పాటు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

మీరు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం కూడా తాగవచ్చు. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు మీ శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్యాలను బయటకు పోతాయి. అలాగే నిమ్మకాయలోని పోషకాలు మీ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా విటమిన్ సి మీ రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

జీలకర్ర, సోపు కలిపిన నీరు కూడా చాలా ఉదయాన్నే తాగడానికి ఉపయోగకరంగా ఉంటాయి. 2 కప్పుల నీటిలో జీలకర్ర, మెంతులు, సోపు గింజలను వేసి బాగా మరిగించండి. మరిగిన తర్వాత తాగితే బరువు తగ్గుతారు, ఇంకా మీ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మీకు ఈ డ్రింక్స్ నచ్చకుంటే.. ప్రశాంతంగా గోరువెచ్చని నీరు తాగండి. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే మీ శరీరం కూడా హైడ్రేటెడ్ ఉంటుంది. ఇంకా శరీరంపై ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవు.