
ఎండాకాలంలో ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల మట్టి కుండలో నీటిని తాగడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సమ్మర్లో మట్టికుండలో నీటిని తాగితే గ్యాస్టిక్ సమస్యలతో పాటు పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి.

మటి కుండలో ఉంచిన నీళ్లలో సహాజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. బాడీ ఎనర్జిటిక్గా ఉంటుంది. కుండలో నీరు తాగితే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడే వాళ్లు కుండ నీళ్లు తాగడం వల్ల.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.

మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని వేసవికాలంలో రోజు రెండు నుంచి మూడు లీటర్లు తాగితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఎండాకాలంలో ఎక్కువగా డిహైడ్రేషన్ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు కూడా మట్టికుండలో నీళ్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.

మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.

మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.