
వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది హీరోయిన్ త్రిష. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతుంది.

గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న త్రిష 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఆమె మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించనుంది.

ఈ మూవీ ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

అయితే ఈ మూవీ ప్రమోషన్లో త్రిష మరింత అందంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ అందంతో మంత్రముగ్దులను చేస్తుంది.