నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ కమెడియన్గా ఉన్న సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా విలన్గా మారిపోయారు. తెలుగులో ఇంకా కామెడీ రోల్స్ చేస్తున్నా... ఇతర భాషల్లో మాత్రం టాప్ స్టార్స్తో ఢీ కొంటూ విలన్గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ తాజాగా మరో కొత్త ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సునీల్.
కమెడియన్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగానూ సక్సెస్ అయ్యారు సునీల్. అయితే హీరోగా ఒకటి రెండు సక్సెస్లు వచ్చినా... ఆ టెంపో మెయిన్టైన్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఆ టైమ్లో సరైన నిర్ణయం తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు ఈ స్టార్ కమెడియన్.
కమెడియన్గానే పాపులర్ అయిన సునీల్ సడన్గా తనలో విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్ మేకర్స్ సునీల్ను విలన్గా తీసుకునేందుకు కాస్త ఆలోచించినా... ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళ్లో స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్గా నటించి మెప్పించారు సునీల్.
తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు రావటంతో మలయాళ సినిమా పిలిచి మరీ ఆఫర్ ఇచ్చింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాతో విలన్గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సునీల్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన టర్బో సినిమాతో మలయాళ ప్రేక్షకులను కూడా మెప్పించారు.
ఇప్పుడు సాండల్వుడ్ ఎంట్రీకి రెడీ అయ్యారు సునీల్. సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న మ్యాక్స్ సినిమాతో కన్నడ ఆడియన్స్ను పలకరించబోతున్నారు. వరుసగా ఒక్కో ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలకు విలన్గా నటిస్తూ పాన్ ఇండియా ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు సునీల్.