
మంచు వారింట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మంచు విష్ణు ఫ్యామిలీతో కలిసి తన దుబాయ్ ఇంట్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. విష్ణు భార్య వెరోనికా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరోవైపు తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ తన ఇంట్లో క్రిస్మస్ లంచ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు శివకార్తికేయన్, త్రిష, ఖుష్బూ, రమ్యకృష్ణ, శోభన, జయసుధ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఇక మిల్కీబ్యూటీ తమన్నా.. ముంబైలోని తన ఇంట్లో క్రిస్మస్ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్ కలర్ డ్రస్లో తమన్నా లుక్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.

క్రిస్మస్ సందర్భంగా హీరోయిన్ కృతిశెట్టి షార్ట్ డ్రెస్ లోనూ ఎంతో క్యూట్ గా కనిపించింది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.

వీరితో పాటు హెబ్బా పటేల్, రెజీనా, కృతి శెట్టి తదితరులు క్రిస్మస్ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక పటాస్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు తన భార్య స్టెల్లా, కూతురుతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నాడు. ఈ వేడుకలు సంబంధించిన ఫొటోలను స్టెల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది.