
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతోన్న బిజీ ఆర్టిస్టులతో ఆమె ఒకరు. టీవీ షోస్ తో పాటు ఈవెంట్స్ చేస్తూ నిత్యం బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ప్రస్తుతం ఈ బిజీ యాంకర్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోతో పాటు, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే రియాలిటీ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అలాగే సినిమా ఫంక్షన్లు, ఈవెంట్స్ ను కూడా హోస్ట్ చేస్తోంది.

సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే శ్రీముఖికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా తీరిక దొరికినప్పుడల్లా తీర్థయాత్రలకు వెళుతుంటుంది. గతంలో ఆమె తిరుమల, అరుణాచలం తదితర ప్రముఖ ఆలయాలను దర్శించుకుంది.

తాజాగా దేశంలోనే ప్రముఖ దేవస్థానంగా పేరున్న కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది శ్రీముఖి. సంప్రదాయంగా ముస్తాబైన ఈ యాంకరమ్మ అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం తన యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన పోస్టుకు 'జై మా కామాఖ్య' అంటూ క్యాప్షన్ ఇచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోన్న శ్రీముఖి చివరిగా భోళా శంకర్ సినిమాలో మెరిసింది.