
అనుష్క అంటే తెలియని వారుండరు. ఆ రోజుల్లో వరస సినిమాలతో టాలీవుడ్నే షేక్ చేసింది ఈ బ్యూటీ. నాగార్జున సూపర్ మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

ఇక టాలీవుడ్లో అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ఫిమ్స్లో కూడా ఈ బ్యూటీకి సాటిలేరు అనేలా తన నటతో ఆ పాత్రలకే ప్రాణం పోసింది.

బాహుబళి వంటి సినిమాల్లో నటించి వరల్డ్ వైడ్ మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం టాలీవుడ్లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఘాటీ సినిమాతో తమ అభిమానులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ చిన్నది.

తాజాగా అనుష్క కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో ఒక సినిమాలు మిస్ అయ్యాయంట .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో ముందుగా అనుష్క అనుకున్నారంట. కానీ స్వీటి శెట్టి మూవీలో తన పాత్ర చాలా చిన్నగా ఉండటంతో త్రిషను ఒకే చేశారంట. ఇలా వీరిద్దరి కాంబోలో మూవీ మిస్ అయ్యింది.