Heroine Directors: నటన మాత్రమే కాదు.. దర్శకత్వంలోనూ సత్తా చాటిన తెలుగు హీరోయిన్స్..

Updated on: Apr 11, 2025 | 10:20 AM

టాలీవుడ్‎లో హీరోయిన్స్ ఏజ్ పెరిగేకొద్ద అక్కగా, వదినగా, తల్లిగా నటించడం మనకి తెలిసిందే. బట్ ఫర్ ఆ చేంజ్.. వాళ్లు కూడా మెగాఫోన్ పట్టి దర్శత్వం వహిస్తే.. ఎలా ఉంటుంది.? ఈ విషయంలో  కొందరు హీరోయిన్స్ ప్రూవ్ చేసుకున్నారు కూడా. మరి వారెవరు.? ఎన్ని సినిమాలు దర్శకత్వం వహించారు.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి.. 

1 / 5
సావిత్రి.. నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకుంది. మహానటిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పట్లో ఈమె డేట్స్ కోసం డైరెక్టర్లు ఎంతో ఎదురుచూసేవారు. హీరోలు ఈమె హీరోయిన్ గా ఉంటేనే సినిమా చేస్తాం అన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఈమె కొన్ని సినిమాలకు దర్శకురాలిగా కూడా చేసారు. వాటిలో కొన్ని చిన్నారి పాపాలు, మాతృదేవత,  ప్రతాపం, వింత సంసారం.  ఆ తరంలో అంజలి దేవి, జామున లాంటి వాళ్లు కూడా దర్శకులుగా రాణించారు. 

సావిత్రి.. నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని స్థానాన్ని సంపాదించుకుంది. మహానటిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పట్లో ఈమె డేట్స్ కోసం డైరెక్టర్లు ఎంతో ఎదురుచూసేవారు. హీరోలు ఈమె హీరోయిన్ గా ఉంటేనే సినిమా చేస్తాం అన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఈమె కొన్ని సినిమాలకు దర్శకురాలిగా కూడా చేసారు. వాటిలో కొన్ని చిన్నారి పాపాలు, మాతృదేవత,  ప్రతాపం, వింత సంసారం.  ఆ తరంలో అంజలి దేవి, జామున లాంటి వాళ్లు కూడా దర్శకులుగా రాణించారు. 

2 / 5
భానుమతి.. చిత్రనిర్మాత, నటి, సంగీత స్వరకర్త, గాయని, గేయ రచయిత్రిగా ఆమె దాదాపు అన్ని చేసింది. నటిగా ఆమె ఆ సమయంలో జమున, సావిత్రి వంటి తెలుగు సినిమా ప్రముఖ నటీమణులకు స్ఫూర్తినిచ్చింది. ఆమె ఒకేసారి ఎనిమిది పనులు చేయగలిగినందున, ఆమెను పరిశ్రమ ప్రజలు ప్రేమగా 'అష్టావదాని' అని పిలిచేవారు. ఆమె 1939లో 'వర విక్రయం', 'చండీరాణి'తో లాంటి మరికొన్ని చిత్రాలు దర్శకత్వం వహించింది. ఆమె భారతీయ సినిమాలో మొదటి మహిళా దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది.

భానుమతి.. చిత్రనిర్మాత, నటి, సంగీత స్వరకర్త, గాయని, గేయ రచయిత్రిగా ఆమె దాదాపు అన్ని చేసింది. నటిగా ఆమె ఆ సమయంలో జమున, సావిత్రి వంటి తెలుగు సినిమా ప్రముఖ నటీమణులకు స్ఫూర్తినిచ్చింది. ఆమె ఒకేసారి ఎనిమిది పనులు చేయగలిగినందున, ఆమెను పరిశ్రమ ప్రజలు ప్రేమగా 'అష్టావదాని' అని పిలిచేవారు. ఆమె 1939లో 'వర విక్రయం', 'చండీరాణి'తో లాంటి మరికొన్ని చిత్రాలు దర్శకత్వం వహించింది. ఆమె భారతీయ సినిమాలో మొదటి మహిళా దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది.

3 / 5
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భార్య విజయ్ నిర్మల తెలుగు సినిమా దర్శకురాలు, నిర్మాత, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ మహిళా దర్శకుల్లో ఒకరు. ఆమె ‘మీనా’ (1971) ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ (1979), ‘ప్రజాల మనిషి’ (1990) ‘అవును నేనంటే నేనే’ (1994) ‘గౌరవంతి’ (1994) అనే చిత్రాలకు దర్శకురాలిగా పనిచేశారు. ఈమె పేరు గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో న‌మోదైంది.

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భార్య విజయ్ నిర్మల తెలుగు సినిమా దర్శకురాలు, నిర్మాత, నటి. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ మహిళా దర్శకుల్లో ఒకరు. ఆమె ‘మీనా’ (1971) ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ (1979), ‘ప్రజాల మనిషి’ (1990) ‘అవును నేనంటే నేనే’ (1994) ‘గౌరవంతి’ (1994) అనే చిత్రాలకు దర్శకురాలిగా పనిచేశారు. ఈమె పేరు గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో న‌మోదైంది.

4 / 5
వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ చిత్రం అలనాటి హీరోయిన్ శ్రీప్రియకు కంటెంట్-ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించే చొరవ ఉందని నిరూపించింది. అది బాక్సాఫీస్ వద్ద రాణించింది. ‘అంతులేని కథ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘వాయు పిలిచింది’, ‘బెజవాడ బెబ్బులి’ , ‘కొంగు చాటు కృష్ణుడు’ వంటి చిత్రాలలో మంచి పాత్రలు పోషించిన ఆమె సినీ ప్రపంచానికి కొత్తేమీ కాదు.

వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ చిత్రం అలనాటి హీరోయిన్ శ్రీప్రియకు కంటెంట్-ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్‌ను రూపొందించే చొరవ ఉందని నిరూపించింది. అది బాక్సాఫీస్ వద్ద రాణించింది. ‘అంతులేని కథ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘వాయు పిలిచింది’, ‘బెజవాడ బెబ్బులి’ , ‘కొంగు చాటు కృష్ణుడు’ వంటి చిత్రాలలో మంచి పాత్రలు పోషించిన ఆమె సినీ ప్రపంచానికి కొత్తేమీ కాదు.

5 / 5
జీవిత రాజశేఖర్.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా చాలా చిత్రాల్లో పని చేసింది. ఈమె దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'శేషు'.  దీని తర్వాత సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ సినిమాలు డైరెక్ట్ చేసింది. వీటి అన్నింటిలోనూ ఆమె భర్త రాజశేఖర్ హీరోగా నటించారు. చివరిగా చేసిన శేఖర్‎లో ఆమె కూతురు శివాని రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించింది. 

జీవిత రాజశేఖర్.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా చాలా చిత్రాల్లో పని చేసింది. ఈమె దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'శేషు'.  దీని తర్వాత సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ సినిమాలు డైరెక్ట్ చేసింది. వీటి అన్నింటిలోనూ ఆమె భర్త రాజశేఖర్ హీరోగా నటించారు. చివరిగా చేసిన శేఖర్‎లో ఆమె కూతురు శివాని రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించింది.