
టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ క్రమంలోనే శివాని నాగరం అనే ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు గాయని , కూచిపూడి నృత్యకారిణి కూడా.. ఈ ముద్దుగుమ్మ 2024లో విడుదలైన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో ఆమె సుహాస్ సరసన లక్ష్మి పాత్రలో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శివాని ఈ అవకాశాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ఆడిషన్ మెసేజ్ ద్వారా పొందింది, మొదట హీరోయిన్ స్నేహితురాలి పాత్ర కోసం వెళ్లి, తర్వాత హీరోయిన్గా ఎంపికైంది.

ఆమె ప్రస్తుతం "లిటిల్ హార్ట్స్" అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా, శివాని గాయనిగా కూడా తన ప్రతిభను చూపించింది, "ఆరంభం" అనే సినిమాలో "అమాయకంగా" అనే పాటను ఆలపించింది, ఇది ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫొటోలతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఆమె తన సహజమైన అందం, నటనా నైపుణ్యంతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. శివాని హైదరాబాద్కు చెందిన తెలుగు అమ్మాయి. తెలుగు నటీమణులకు సినిమా రంగంలో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటుంది ఈ భామ.

ఆమె కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది, పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. భవిష్యత్తులో కథలో కీలకమైన, ప్రతిభను చాటే పాత్రలను చేయాలని ఆమె ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం సుహాస్ సరసన హే భగవాన్ అనే సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.